పామాయిల్ కూలీలకు తుమ్మల తీపి కబురు
ఇందూర్ వార్త, ఖమ్మం భద్రాద్రి జిల్లా బ్యూరో
– పామాయిల్ ఫైబర్ హార్వెస్టర్స్ కు 50% రాయితీ
– హార్టికల్చర్ ద్వారా దరఖాస్తు చేయాలన్న మంత్రి
పామాయిల్ కూలీలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు తీపి కబురు అందించారు..దమ్మపేట మండలానికి చెందిన పామాయిల్ కూలీలు ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును గండుగులపల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. పామాయిల్ గెలలు కోసేందుకు అవసరమైన ఫైబర్ హార్వెస్టర్ గడల కోసం విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల స్పందిస్తూ హార్టికల్చర్ శాఖ ద్వారా దరఖాస్తు చేస్తే 50 శాతం రాయితీపై గడలు(పామాయిల్ ఫైబర్ హార్వెస్టర్స్) అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పామాయిల్ కూలీలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ వైస్ ఛైర్మన్ కొయ్యల అచ్యుతరావు, కాసాని నాగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు